సత్తుపల్లిలో పోక్సో కేసు నమోదు
సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి పోక్సో కేసు నమోదు చేశారు.
దిశ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి పోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ బాలికతో బాబాయ్ వరుస అయ్యే షేక్ పాషామియా బుధవారం సాయంత్రం బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా షేక్ పాషామియా పై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.