దండు మల్కాపురంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో చుక్క రాజు (38) అనే వ్యక్తి గురువారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-10-24 17:26 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో చుక్క రాజు (38) అనే వ్యక్తి గురువారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ రాజు జీవనోపాధి కోసం చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామానికి వలస వచ్చి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదని ఇన్స్పెక్టర్ మన్మధరావు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దండు మల్కాపురం గ్రామానికి చేరుకొని రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News