భూములను అప్పగించింది గత పాలకులే

రామన్నపేట మండలంలో నిర్మించాలనుకుంటున్న అంబుజా సిమెంట్ కంపెని భూములను అప్పగించిందే.. గత పాలకులని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

Update: 2024-10-24 13:00 GMT

దిశ ,నకిరేకల్ : రామన్నపేట మండలంలో నిర్మించాలనుకుంటున్న అంబుజా సిమెంట్ కంపెని భూములను అప్పగించిందే.. గత పాలకులని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రస్తుతం కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కంపెనీ ఏర్పాటును తాము సైతం వ్యతిరేకిస్తున్నామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. ఏదేమైనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీని ఏర్పాటు చేయనీయమన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటారని తెలిపారు.


Similar News