రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

మండలంలోని పైడిపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర లో ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో,

Update: 2024-10-24 15:36 GMT

దిశ, జన్నారం: మండలంలోని పైడిపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర లో ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో, చింతలపల్లి గ్రామానికి చెందిన కట్లకుంట రాజన్న (52) అక్కడికక్కడే మృతి చెందగా చెరుకు గూడ గ్రామానికి చెందిన ముల్కల్ల రవీందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు దండేపల్లి మండలంలోని పెద్దయ్య దేవుడిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దర్యాప్తు జరుపుతున్నట్లు జన్నారం ఎస్‌ఐ గుండేటి రాజవర్ధన్ తెలిపారు.


Similar News