లైంగిక దాడి ఘటనలో మైనర్ బాలిక మృతి

ఈనెల 20న లైంగిక దాడికి గురై చికిత్స పొందుతున్న ఓ మైనర్ బాలిక మృతి చెందింది.

Update: 2024-10-24 15:31 GMT

దిశ,తిరుమలాయపాలెం : ఈనెల 20న లైంగిక దాడికి గురై చికిత్స పొందుతున్న ఓ మైనర్ బాలిక మృతి చెందింది. ఈ ఘటన గురువారం తిరుమలాయపాలెం మండలంలో వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక (17)ను మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం తానంచెర్ల గ్రామానికి చెందిన మరో మైనర్ బాలుడు మాతంగి విష్ణువర్ధన్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తానంచెర్ల గ్రామంలో ఈనెల 20న తన స్నేహితురాలి వివాహం ఉండగా ఆ బాలిక 19న అక్కడకు వెళ్లింది.

    పెళ్లి అనంతరం డీజే ఊరేగింపులో విష్ణువర్ధన్ ఆ బాలికతో ఘర్షణ పడి కొట్టి బలవంతంగా బైక్ పై తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో రెండు రోజుల వరకు అక్కడే ఉండి 22న సొంత గ్రామానికి వచ్చింది. ఎవరికీ చెప్పుకోలేక బుధవారం ఉదయం ఇంట్లో గడ్డి మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతికి ముందు బాధిత బాలిక అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు.  

Tags:    

Similar News