మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య...
మద్యానికి బానిసై ఒకరు మృతి చెందిన ఘటన కుంటాల మండలం లో చోటు చేసుకుంది.
దిశ, భైంసా: మద్యానికి బానిసై ఒకరు మృతి చెందిన ఘటన కుంటాల మండలం లో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం కల్లూరు గ్రామానికి చెందిన డోంగ్రే సచిన్ (33) ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతదేహాన్ని స్థానిక భైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. భార్య డోంగ్రే మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.