నిర్లక్ష్యం బాలుడి ప్రాణం తీసింది

భీంగల్ మండల కేంద్రంలోని నందిగల్లీలో ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తోపారం నిశ్వంత్ (7) అనే బాలుడు మృతి చెందాడు.

Update: 2024-10-08 15:26 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భీంగల్ మండల కేంద్రంలోని నందిగల్లీలో ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తోపారం నిశ్వంత్ (7) అనే బాలుడు మృతి చెందాడు. భీంగల్ నుంచి సిరికొండ వైపునకు వెళ్తున్న ట్రాలీ వెహికిల్ ను డ్రైవర్ మహమ్మద్ అఫ్రోజ్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో నందిగల్లి వద్ద రోడ్డు దాటుతున్న నిశ్వంత్ ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బాలుడి తలకు బలమైన గాయాలయ్యాయి. బాలుడిని హుటాహుటిన ఆర్మూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు డాక్టర్ ధ్రువీకరించారు. మృతుని తల్లి వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. 

Tags:    

Similar News