ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక వ్యక్తి మృతదేహం కలకలం..

చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక డోర్ సమీపంలో ( 30) ఏండ్ల వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.

Update: 2024-10-24 06:24 GMT

దిశ, చిన్నశంకరంపేట : చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక డోర్ సమీపంలో ( 30) ఏండ్ల వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. డెడ్ బాడీ గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతుడు ఎవరు.. ఎవరైనా హత్య చేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే ఆలోచనలో పడ్డారు. ఈ విషయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సాయి సింధు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా రామాయం పేట సీఐ వెంకట రాజా గౌడ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు.


Similar News