ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తు తిరుమలాపూర్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-09-25 14:20 GMT

దిశ, పెద్ద శంకరంపేట్ : ప్రమాదవశాత్తు తిరుమలాపూర్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట ఏఎస్ఐ సునీత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద శంకరంపేటకు చెందిన అవుసుల శ్రీనివాస్ చారి (58) మంగళవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లాడన్నారు. శ్రీనివాస్ చారి టైలరింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

అతనికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉందన్నారు. బుధవారం ఉదయం అతని మృతదేహం తిరుమలాపూర్ చెరువులో తేలియాడడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News