రూ. 12 లక్షలకు పాప విక్రయం.. తండ్రి ఆత్మహత్య!? అంతా చేసింది తల్లీచెల్లినేనా..?

తనకు తెలియకుండా తన కూతురిని తల్లి చెల్లి విక్రయించారని మనస్థాపానికి గురైన ఓ తండ్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-10-24 07:16 GMT

దిశ, మర్రిగూడ (నాంపల్లి) : తనకు తెలియకుండా తన కూతురిని తల్లి చెల్లి విక్రయించారని మనస్థాపానికి గురైన ఓ తండ్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని గట్ల మల్లేపల్లి గ్రామంలో మలిగిరెడ్డి సైదిరెడ్డి దీపికను ఏడు సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదు సంవత్సరాల ఒక పాప ఉంది. సైదిరెడ్డి తల్లి రమణమ్మ చెల్లె సంధ్యలు కలిసి సైదిరెడ్డి భార్యను తన కులం కాదని ఇంటి నుండి పంపించారని గ్రామంలో ప్రచారం ఉంది.

నెల రోజుల కిందట తల్లి, చెల్లి కలిసి పాపను గుంటూరు జిల్లాకు చెందిన దంపతులకు 12 లక్షలకు విక్రయించినట్లు ప్రచారం కూడా సాగుతుంది. తండ్రి సైదిరెడ్డి తల్లిని, చెల్లిని నిలదీయగా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సైదిరెడ్డి మరణించడంతో తల్లి కూతుర్లు కలిసి పాపను గట్ల మల్లె పెళ్లికి తీసుకువచ్చారు. తల్లితండ్రి లేకపోవడంతో ఫౌండేషన్కు నెలకు నాలుగు వేలు ఇచ్చి అప్ప చెప్తామని తల్లికూతుర్లు చెబుతున్నారు. సైదిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై శోభన్ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News