ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్ లారీ.. వ్యక్తి మృతి..

టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

Update: 2024-10-24 07:22 GMT

దిశ, కూసుమంచి : టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే జుజ్జుల్ రావుపేట గ్రామానికి చెందిన అనీల్ (35) ద్విచక్ర వాహనం పై వెళ్తున్నాడు. సరిగ్గా మల్లేపల్లి గ్రామ శివారుకి రాగానే టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


Similar News