పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

మండలంలోని పాపకొల్లు గ్రామానికి చెందిన పావురాల వెంకటేశ్వర్లు (50) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-10-06 13:41 GMT

దిశ, జూలూరుపాడు : మండలంలోని పాపకొల్లు గ్రామానికి చెందిన పావురాల వెంకటేశ్వర్లు (50) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర్లు భార్య గత ఏడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో ఆయన అప్పటి నుంచి అదే గ్రామంలోని సోదరుని కుమారుడు ఇంట్లోనే ఉంటున్నాడు. సంతానం లేకపోవడం, భార్య మృతి చెందడంతో ఒంటరి జీవితం గడపలేనని పలుమార్లు బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

     శనివారం కొత్తగూడెంలోని సోదరుని ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని ఎస్సై రాణాప్రతాప్ సందర్శించారు. మృతుడి సమాచారాన్ని సేకరించి బంధువులకు తెలియజేశారు. మృతుడి సోదరుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య తెలిపారు. 

Tags:    

Similar News