ఘోరం.. రైల్వే స్టేషన్ వెనుక వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్ రైల్వే స్టేషన్ వెనుక ఓ వ్యక్తి శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2024-09-29 07:11 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రైల్వే స్టేషన్ వెనుక ఓ వ్యక్తి శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, 3 టౌన్ ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..

నవీపేట్ మండలానికి చెందిన గణేష్ (30) అనే వ్యక్తి తన అక్క బావతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాగా, గొడవల కారణంగా కొంతకాలంగా భార్యతో దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ విషయమై కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం మృతుడి భార్య తరపు బంధువులు గణేష్‌తో మాట్లాడేందుకు నిజామాబాద్‌కు వచ్చినట్లు తెలిసింది. అయితే రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల వద్ద గణేష్ మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే మూడో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్‌ను ఆయన భార్య తరపు బంధువులే చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మృతుడి మెడకు తాడు వేసి ఊపిరాడకుండా చేసి చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


Similar News