మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కర్నాటి మృతి.. శోకసంద్రంలో నాంపల్లి

మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ కర్నాటి రామలింగం (70) శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

Update: 2024-09-28 04:15 GMT

దిశ, మర్రిగూడ (నాంపల్లి) : మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ కర్నాటి రామలింగం (70) శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కర్నాటి రామలింగం.. తెలుగుదేశం హయాంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, నాంపల్లి జెడ్పిటిసిగా, భద్రాచలం దేవస్థానం కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు బిడ్డలు ఒక కుమారుడు కాగా నాలుగు సంవత్సరాల క్రితం కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుండి అనారోగ్యానికి రామలింగం గురయ్యారు. అయితే హైదరాబాదులో నివాసం ఉంటున్న కర్నాటి గత 15 రోజులుగా తీవ్ర అస్వస్థత గురికాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐదు రోజుల క్రితం స్వగ్రామం నాంపల్లికి రాగా తెల్లవారుజామున కర్నాటి కన్నుమూశారు. వివిధ పదవులు అలంకరించి నాంపల్లి మండలానికి వన్నెతెచ్చిన కర్నాటి రామలింగం మృతి చెందడంతో నాంపల్లి మండలం శోకసంద్రంలో మునిగింది. కాగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులుగా ఉన్న కర్నాటి విద్యాసాగర్ కర్నాటి రామలింగంకు స్వయానా తమ్ముడు. ఈరోజు అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నాటి మృతితో మండల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Similar News