రైఫిల్‌తో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసైన యువ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చోటుచేసుకుంది.

Update: 2024-09-28 02:26 GMT

దిశ, యాచారం (ఇబ్రహీంపట్నం): రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ గౌడ్(28) తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రానికి చెందిన బాలకృష్ణ తెల్లవారుజామున బాత్రూం గదిలోకి వెళ్లి, తలుపులు మూసివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందగానే ఆదిభట్ల పోలీసులు మృతదేహాన్ని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినప్పుడు మృతులతోపాటు సహ ఉద్యోగులు ముగ్గురు డ్యూటీలో ఉన్నట్లు సమాచారం. అయితే మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే మృతుడు ఆన్లైన్ గేమ్స్ బానిసై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.


Similar News