మహిళా దొంగలు రిమాండ్

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల 16న శ్రీ వెంకటేశ్వర బంగారం షాపులో నలుగురు మహిళలు చోరీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-27 14:46 GMT

దిశ, అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల 16న శ్రీ వెంకటేశ్వర బంగారం షాపులో నలుగురు మహిళలు చోరీ చేసిన విషయం తెలిసిందే. వీరిని పోలీసులు శుక్రవారం రిమాండ్​ కు తరలించారు. వీరు షాపులోని 10 జతల వెండి కాళ్లపట్టీలు (విలువ లక్ష 80వేలు) దొంగిలించారు. షాపు యజమాని అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ కెమెరాలను పరిశీలించి తిమ్మాజీపేట మండలం బాజీపూరాం తండాకు చెందిన మూడావత్ బుజ్జి, మూడావత్ లక్ష్మి, మూడావత్ అస్లీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు అచ్చంపేట ఎస్సై రాములు తెలిపారు. 

Tags:    

Similar News