చేపల వేటకు వెళ్లి మృతి

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వల చుట్టుకొని మృతి చెందిన ఘటన మండలంలోని మహంతంలో చోటుచేసుకుంది.

Update: 2024-09-24 14:34 GMT

దిశ, నవీపేట్ : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వల చుట్టుకొని మృతి చెందిన ఘటన మండలంలోని మహంతంలో చోటుచేసుకుంది. నవీపేట్ పోలీసుల సమాచారం మేరకు మండలంలోని మహంతం గ్రామానికి చెందిన పల్లికొండ భూమన్న (61) ఆదివారం చేపల వేటకు గ్రామంలోని కండ సంద్రం చెరువు వద్దకు వెళ్లి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చెరువు పరిసరాలలో వెతకగా కనిపించలేదు. దాంతో చుట్టాల ఇంటికి వెళ్లాడని భావించారు. మంగళవారం చెరువులో భూమన్న మృతదేహం కనిపించిందని, మృతుని కుమారుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి కి తరలించామని నవీపేట్ ఎస్సై కె.వినయ్ తెలిపారు.

Tags:    

Similar News