అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం కల్వకుంట లో మంగళవారం జరిగింది.

Update: 2024-10-22 12:51 GMT

దిశ, నిజాంపేట : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం కల్వకుంట లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కల్వకుంట కు చెందిన ముష్టి గొల్ల కృష్ణ(35) ఈనెల 20 ఆదివారం సాయంత్రం 7 గంటలకు బయటికి వెళ్తున్నానని చెప్పి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. కల్వకుంట శివారులోని సబ్ స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యమవడంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. తన కుమారుని మరణంపై అనుమానాలు ఉన్నాయని మృతుని తల్లి బాలమని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


Similar News