వరకట్నం వేధింపులతో కూతురు మృతి.. తండ్రి చేసిన పనికి అంతా షాక్..!
తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన కూతురి మృతి(Daughter Dead)కి కారణమైన వారి వివరాలు చెప్పాలని నేషనల్ హైవేపై తండ్రి ప్లెక్సీ ఏర్పాటు చేశారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన కూతురి మృతి(Daughter Dead)కి కారణమైన వారి వివరాలు చెప్పాలని నేషనల్ హైవేపై తండ్రి ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఘటన నారాయణపేట్(Narayanapet) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేటకు చెందిన చన్నప్పగౌడ్ కూతురు జయలక్ష్మికి కర్ణాటకలోని శంకర్పల్లికి చెందిన శంకర్ రెడ్డితో మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. వరకట్న వేధింపు(Dowry Harassment)లతో జయలక్ష్మి ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ తండ్రి ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ‘నా కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, ఆడపడుచు అదృశ్యమయ్యారు. ఆ ముగ్గురు కనిపిస్తే నాకు సమాచారమివ్వండి’ అని జాతీయ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీనిని చూసిన వారంతా షాక్కు గురవుతున్నారు. వరకట్నం కోసం వేధించి, యువతి మృతికి కారణమైన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు.
వరకట్నం వేధింపులతో కూతురు మృతి.. భర్త, అత్త, ఆడపడుచు కనిపిస్తే నాకు సమాచారమివ్వండి అని జాతీయ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2024
నారాయణపేట - చెందిన చన్నప్పగౌడకు చెందిన కూతురు జయలక్ష్మికి కర్ణాటకలోని శంకర్పల్లికి చెందిన శంకర్ రెడ్డి 3ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. కాగా వరకట్న వేధింపులతో ఆమె… pic.twitter.com/us51IE25Mz