రాజధానిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. కారుతో గుద్ది కానిస్టేబుల్‌ని అత్యంత దారుణంగా..

కారు సైడ్ తీసుకోవాలని చెప్పినందుకు ఓ కానిస్టేబుల్‌ని కారుతో గుద్ది ఈడ్చుకెళ్లి మరో కారుకు గుద్ది చంపేసిన అమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

Update: 2024-09-29 08:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కారు సైడ్ తీసుకోవాలని చెప్పినందుకు ఓ కానిస్టేబుల్‌ని కారుతో గుద్ది ఈడ్చుకెళ్లి మరో కారుకు గుద్ది చంపేసిన అమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నంగ్లోయ్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ అనే కానిస్టేబుల్ శనివారం రాత్రి సంగ్లోయ్ ఏరియాలో తన బైక్‌పై పెట్రోలింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో లెఫ్ట్ టర్న్ తీసుకుంటుండగా ఓ ఫార్చునర్ కార్ వేగంగా అటువైపుగా రావడంతో కార్ సైడ్ తీసుకోవాలంటూ కోప్పడిన సందీప్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సదరు ఫార్చునర్ నడుపుతున్న వ్యక్తి వేగంగా కారుతో సందీప్‌ బైక్‌ని వెనుక నుంచి ఢీ కొట్టాడు.

కనీసం 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి ముందు వెళుతున్న మరో కారుకు డ్యాష్ ఇచ్చాడు. దీంతో కానిస్టేబుల్ సందీప్ రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో అతడి తలకి భారీ గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఫార్చునర్ కారును సీజ్ చేశామని, ఘటన జరిగినప్పుడు కార్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వారిని గుర్తించి తర్వలో అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఇది పూర్తిగా రోడ్ రేజ్ చర్యేనని, కావాలనే కానిస్టేబుల్‌ని గుద్ది హతమార్చారని ఢిల్లీ పోలీస్ విభాగం వెల్లడించింది. 


Similar News