ఆ మండలంలో వరుస బైక్ చోరీలు...

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా వరుసగా బైక్ దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Update: 2024-10-20 05:27 GMT

దిశ, మఠంపల్లి : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా వరుసగా బైక్ దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల క్రితం మఠంపల్లి మండల కేంద్రంలోని అల్లిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని పొలం పక్కన ఉంచిన బైక్ చోరీకి గురి అయింది. పది రోజుల క్రితం అదే మఠంపల్లి మండలంలోని సుల్తాన్ పురం గ్రామానికి చెందిన భూక్య నరసింహ అనే రైతు బండిని సుల్తాన్ పురం ఎన్సీఎల్ మధ్యలో పొలం పక్కన రోడ్డు దగ్గర పార్కింగ్ చేయగా పట్టపగలే బైక్ చోరీ చేశారు. బైక్ చోరీలకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో మట్టపల్లి లో మురళి అనే వ్యక్తి ఇంటి ముందు ఉంచిన బైక్ ని కూడా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బైక్ ఎత్తుకొని పోయారు. అప్పుడు కూడా మఠంపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే అధిక మొత్తంలో బైక్ లు మఠంపల్లి మండలంలోనే దొంగతనాలకు గురికావడం మండల ప్రజలకు భయాందోళనకు గురిచేస్తుంది. ఇకనైనా పోలీస్ ఉన్నతాధికారులు బైక్ చోరీల గురించి ప్రత్యేక దృష్టి పెట్టి, బైక్ చోరీలకు గురి కాకుండా ఏ ఇతర వాహనాలు కూడా చోరీలకు గురికాకుండా చూడాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు పోలీసు వారిని కోరుతున్నారు.


Similar News