జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు మృతి

ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-10-20 05:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట సమీపంలో రెండు కార్లు ఒకదానొకటి ఢీ కొనగా.. తల్లి, కొడుకులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గరికపాడు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఘటన చోటు చేసుకోగా.. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ వాసులుగా గుర్తించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News