బద్వేల్ ఘటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి చివరి మాటలు
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధిని మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధిని మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వైఎస్సార్ జిల్లా బద్వేల్లో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించిన యువతి చివరి మాటలు అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. బద్వేల్లో ఉన్మాది చేతిలో హత్యకు గురైన యువతి చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ‘‘అతను వేరే అమ్మాయితో లేచిపోయాడు. నిన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను రానని చెప్పా సార్. నాకు నువ్వు కావాలి రాకపోతే చనిపోతా అన్నాడు. సరే అని వెళ్లా. ఈ క్రమంలో లైటర్తో డ్రెస్సుకు నిప్పంటించాడు సార్’’ అని దాడి అనంతరం పోలీసులకు ఆ యువతి వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆ యువతి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ యువతి మాటలు ప్రస్తుతం కీలకంగా మారాయి. ప్రస్తుతం ఆ యువతి చివరి మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.