మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

ఉత్తరాంధ్ర మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణకేంద్రం హెచ్చకరికలు జారీ చేసింది.

Update: 2024-10-20 15:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్ర మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణకేంద్రం హెచ్చకరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్ లో అల్పపీడనం ఏర్పడి, ఎల్లుండిలోగా పశ్చిమ దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ నెల 23 నాటికి అది తుఫానుగా మారి, 24న ఒడిషా-బెంగాల్ తీరాలకు చేరే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణకేంద్రం ప్రకటించింది. కాగా ఆయా తేదీల్లో పశ్చిమ బంగాళాఖాతంలో విపరీతమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వేటకు వెళ్ళిన జాలర్లు వెంటనే తిరిగి రావాలని సూచనలు చేసింది.   


Similar News