రియాల్టీ షోకు చంద్రబాబు.. పవన్, అనితపైనా రోజా ఘాటు వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు...

Update: 2024-10-20 16:26 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలయ్య రియాల్టీ షోకు సీఎం చంద్రబాబు వెళ్లడంపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. బద్వేల్ విద్యార్థిని మృతిని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాలను పట్టించుకోకుండా చంద్రబాబు రియాల్టీ షోకు వెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినన్ని దారుణాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని రోజా విమర్శించారు.

‘‘బాలికలు, ఆడపిల్లలు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరగడం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి దారుణాతి దారుణంగా ఆడపిల్లలను నరికి చంపుతున్నారు. తగలబెట్టి చంపుతున్నారు. అత్తాకోడళ్లు, అమ్మాకూతుళ్లు, చిన్న, పెద్దా అనే తేడా లేకుండా మతిస్థిమితం లేని వాళ్లను కూడా వదిలిపెట్టకుండా నేరస్తులు అఘాత్యాలకు పాల్పడుతున్నారు. నేరాలు, ఘోరాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత అసమర్థతే కారణం.’’ అని రోజా వ్యాఖ్యానించారు. 


Similar News