రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి కుమారుడు మృతి..

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ పరిధిలోని దయ్యాల వాగు సమీపంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-16 03:05 GMT

దిశ, గద్వాల క్రైమ్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ పరిధిలోని దయ్యాల వాగు సమీపంలో చోటు చేసుకుంది. ఎర్రవల్లి స్టేజ్ నుంచి గద్వాలకు బుధవారం తెల్లవారుజామున వస్తుండగా దయ్యాల వాగు సమీపంలో ఉన్న బ్రిడ్జి వాల్ ను కారు బలంగా ఢీకొని కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.

ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డి (28)కి తీవ్రగాయాలు కాగా గమనించిన స్థానికులు హుటాహుటిన గద్వాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కుమారుడిగా గుర్తించారు. మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, రాజకీయ నాయకులు, మిత్రులు వారిని ఓదార్చారు.


Similar News