అనుమానాస్పద స్థితిలో కంప్యూటర్ ఆపరేటర్ మృతి..

గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది.

Update: 2024-10-20 14:40 GMT

దిశ, గార్ల: గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతంపేట గ్రామానికి చెందిన గుమ్మడి మహేష్ (32) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి కి చెందిన గుమ్మడి పాపయ్య కుమారి దంపతుల రెండవ కుమారుడైన మహేష్ 11 సంవత్సరాల కిందట ఉద్యోగం రీత్యా సీతంపేట లోని అమ్మమ్మ గారి ఇంటి సమీపంలో గుడిసె వేసుకొని నివాసం ఉంటూ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని ఇంటికి పోయిన మహేష్ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో ఒక్కడే నిద్రిస్తున్న మహేష్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మృతుడు ముఖంపై, కుడి చేతిపై గాయాలయాలు కావడంతో హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని గార్ల, బయ్యారం సీఐ బి.రవికుమార్, గార్ల, బయ్యారం ఎస్సైలు నిమ్మతోట జీనత్ కుమార్, తిరుపతి సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి సోదరుడు గుమ్మడి రాజు ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.


Similar News