బ్రేకింగ్ : విద్యార్థినులపై లైంగిక వేధింపులు

గుంటూరు జేసీ లా కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.

Update: 2023-02-23 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జేసీ లా కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. విద్యార్థినులను జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్ ఫోన్, చాటింగ్ పేరుతో వేధిస్తున్నాడు. కాగా జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్‌పై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. జేసీ లా కాలేజీలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు లైంగిక వేధింపులు నిజమని తేలడంతో జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News