Pranahita river : ప్రాణహిత నదిలో గల్లంతైన వ్యక్తి శవం లభ్యం..

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని ప్రాణహిత నదిలో ( Pranahita river ) శనివారం ముగ్గురు గల్లంత కాగా, ఆదివారం తెల్లవారుజామున తలాయి ప్రాణహిత నదిలో జహీర్ హుస్సేన్ (లడ్డు ) మృతదేహం లభ్యమైనట్లు తలాయి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

Update: 2024-10-27 06:33 GMT

దిశ, బెజ్జూర్ : ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని ప్రాణహిత నదిలో ( Pranahita river ) శనివారం ముగ్గురు గల్లంత కాగా, ఆదివారం తెల్లవారుజామున తలాయి ప్రాణహిత నదిలో జహీర్ హుస్సేన్ (లడ్డు ) మృతదేహం లభ్యమైనట్లు తలాయి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు జహీర్ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం ప్రాణహిత నదిలో గజ ఈతగాల్ల సహాయంతో గాలింపులు చర్యలు చేపడుతున్నట్లు బెజ్జూర్ ఎస్ఐ విక్రం తెలిపారు. ప్రాణహిత ప్రాంతంలో ఎక్కడైనా మృతదేహాలు కనిపిస్తే సమాచారం అందించాలని ఎస్సై విక్రమ్ కోరారు.

Tags:    

Similar News