బొగ్గుగనిలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమబెంగాల్ లోని బొగ్గుగనిలో సంభవించిన పేలుడులో ఏడుగురు మరణించారు. మరికొందరికి గాయలవ్వగా.. అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి.

Update: 2024-10-07 08:30 GMT

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ బీర్ భూమ్ లోని బొగ్గుగనిలో సంభవించిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలవ్వగా.. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గంగారాంచక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోలిరీలో బొగ్గును తవ్వి తీసేందుకు పేలుళ్లు నిర్వహించిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్నవారిలో కొందరు వెల్లడించారు. పేలుడు తర్వాత.. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆ ప్రాంతం భీతావహంగా కనిపిస్తోంది. పేలుడు తీవ్రతకు అక్కడున్న వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఇదే తరహా పేలుడు జరగ్గా ఏడుగురు మరణించారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అప్పటి పేలుడుకి కారణమైం


Similar News