యాచకులను వదలని బ్లేడ్ బ్యాచ్

ఏపీలో బ్లేడ్ బ్యాచ్ దాడుల ఇటీవల కలకలం రేపుతున్నాయి.

Update: 2023-03-01 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బ్లేడ్ బ్యాచ్ దాడుల ఇటీవల కలకలం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల డోన్ లో యాచకులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి పాల్పడింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న యాచకులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. యాచకులపై దాడి చేసిన బ్లేడ్ బ్యాచ్ ముఠా వారి వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో గాయపడ్డ యాచకులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఏడాది బ్లేడ్ బ్యాచ్ వేయి రూపాయలు ఇవ్వలేదని రాజేశ్ అనే యువకుడిని హత్య చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. వీరి ఆగడాలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.   

Tags:    

Similar News