దారుణం.. కాంక్రీట్ మిల్లర్ ఎక్కి తల్లి కూతురు మృతి

కాంక్రీట్ మిల్లర్ ఢీకొని తల్లీకూతురు దుర్మరణం పాలైన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2024-09-23 07:19 GMT

దిశ, శ్రీరంగాపూర్: కాంక్రీట్ మిల్లర్ ఢీకొని తల్లీకూతురు దుర్మరణం పాలైన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరాల గ్రామానికి చెందిన పులేందర్, స్వాతి భార్యాభర్తలు. అయితే, వారి కూతురు అశ్విత‌ ఇటీవలే అనారోగ్యానికి గురవ్వడంతో చికిత్స నిమిత్తం శ్రీరంగాపూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే బుసిరెడ్డిపల్లి నుంచి బొలెరో వాహనానికి మిల్లర్ మిషన్ తగిలించుకుని వెళ్తుండగా.. ఆ మిల్లర్ మిషన్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశ్విత, స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పులేందర్, స్వాతి దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉండగా.. స్వాతి ఇప్పుడు 5 నెలల గర్భవతి అని స్థానికులు తెలిపారు. ఒకేసారి తల్లీకూతురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నగరాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News