Accused Arrest: కదులుతోన్న బస్సులో మహిళపై అత్యాచారం.. నిందితుడు ఆరెస్ట్!

కదులుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) బస్సులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-09-23 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: కదులుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) బస్సులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జూలై 3న కూకట్‌పల్లి (Kukatpally)కి చెందిన ఓ మహిళ ఏపీలోని సామర్లకోట (Samarlakota)కు వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఈ క్రమంలోనే అదే బస్సులో కండక్టర్‌గా సాయికుమార్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఆ మహిళ ఒంటిరిగా ప్రయాణిస్తుందని తెలుసుకున్న అతడు చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి మాటమాట కలిపాడు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటుందని బాధితురాలిని మరో సీటులోకి మారాలని సూచించాడు. అనంతరం ఆమె నోరును గట్టిగా మూసి రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండటంతో విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బస్‌స్టాప్‌లో దిగిన బాధిత మహిళ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసింది. వారు ట్రావెల్స్ యజమానికి అనిల్‌రెడ్డితో కలిసి చౌటుప్పల్ పోలీసుల(Choutuppal)కు ఫిర్యాదు చేయగా వారు జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేసి కేసును కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ (Kukatpally Police Station)కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  


Similar News