వర్థన్నపేట‌లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త

భార్యాభర్తల మధ్య గొడవ భార్య ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-09-27 06:24 GMT

దిశ, వర్ధన్నపేట: భార్యాభర్తల మధ్య గొడవ భార్య ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో భార్యతో గొడవపడి కత్తితో గొంతు కోశాడు. అడ్డొచ్చిన అత్తమామలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళను వరంగల్ ఎంజిఎంకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన మహిళకు 33 కుట్లు వేసిన వైద్యులు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కాగా గొడవపడిన వారు వర్ధన్నపేట పట్టణానికి చెందిన కవిత, రవిగా పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News