బీజాపూర్ జిల్లాలో దారుణం.. ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య
ఛత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లా బోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
దిశ భద్రాచలం: ఛత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లా బోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పొండపల్లి గ్రామానికి చెందిన తాటి కన్నయ్య అనే గ్రామస్థుడిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చారు. తమ కదలికలను ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు చేరవేస్తున్నాడని వారు ఆరోపించారు. అయితే, ఘటనా స్థలంలో మావోయిస్టులు ఓ లేఖను సైతం వదిలి వెళ్లారు.