పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య..

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకల గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-16 06:21 GMT

దిశ, సత్తుపల్లి : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకల గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకల గూడెం గ్రామానికి చెందిన పొట్ట పవన్ (27) బుధవారం తెల్లవారుజామున పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

కాగా ఉదయం కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో సత్తుపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు పవన్ కు గత ఐదేళ్ల క్రితం కిష్టారం గ్రామానికి చెందిన గోపికృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు భార్య గత కొంత కాలంగా పుట్టింటిలోనే ఉంటుంది. పవన్ మృతి పై స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.


Similar News