పాము కాటుతో ఆశ కార్యకర్త మృతి...

మండలంలోని కొబ్బాయిగూడ కాలనీకి చెందిన కుమ్ర దురపతాబాయి రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో మృతి చెందింది.

Update: 2024-10-16 08:44 GMT

దిశ, ఇంద్రవెల్లి : మండలంలోని కొబ్బాయిగూడ కాలనీకి చెందిన కుమ్ర దురపతాబాయి రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో మృతి చెందింది. వివరాల్లోకెళ్తే కుమ్ర దురపతాబాయి కొబ్బయిగూడాలో ఆశా కార్యకర్తగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. మంగళవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో సుమారు ఒంటి గంట ప్రాంతంలో రెండు సార్లు పాము కాటు వేసిందని, హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందిందని తెలిపారు. మృతురాలికి భర్త సోనేరావు ఇద్దరు కూతుర్లు శ్రీదేవి,అఖిల కొడుకు సందీప్ ఉన్నారు. ఆశ కార్యకర్త మృతితో కొబ్బయిగుడా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News