అతిగా మద్యం తాగాడు.. మందలిస్తారని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

గత మూడు రోజుల నుంచి అతిగా మద్యం సేవించాడు.

Update: 2024-10-16 07:40 GMT

దిశ, బెల్లంపల్లి : గత మూడు రోజుల నుంచి అతిగా మద్యం సేవించాడు. కుటుంబ సభ్యులు మందలిస్తారనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే బెల్లంపల్లి మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన మంచాల మహేష్ (28) అతిగా మద్యం సేవిస్తుండేవాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ మందలిస్తారో అనే భయంతో సోమవారం పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఆస్పత్రిలోనే మృతి చెందాడు. ఈ మేరకు తాళ్ల గురిజాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News