కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-09-29 15:35 GMT

దిశ, పెద్దేముల్ : కడుపునొప్పి భరించలేక మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి తండాకు చెందిన రాథోడ్ రోమి బాయి (49) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. ఈమెకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండేది.

     ఆదివారం ఉదయం కూడా తీవ్రంగా కడుపునొప్పి రావడంతో దానిని భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పక్కింటి వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దేముల్ ఎస్సై గిరి తెలిపారు.  

Tags:    

Similar News