దారుణం.. ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యం..
అభం శుభం తెలియని ఓ ఏడేండ్ల బాలిక పై ఓ ప్రబుద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలంలో చోటుచేసుకుంది.

దిశ, అచ్చంపేట : అభం శుభం తెలియని ఓ ఏడేండ్ల బాలిక పై ఓ ప్రబుద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పై పొదరా ఎస్సై రాజు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. పదరా మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను తమ సమీప బంధువుల ఇంటి వద్ద ఉంచి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్ళారు. అదే అదునుగా భావించిన మామ వస్తాయన ఆ బాలిక పై ఈనెల 14న అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్సై వివరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.