నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు దుర్మరణం
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, సైదాపూర్ : నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ స్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎలబోయిన చైతన్య-సురేష్ దంపతుల ఎకైక కుమారుడు ఎలబోయిన ప్రజ్ఞాన్ కు రెండేళ్లు. మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న నీటి సంపులో పడి దుర్మరణం చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రుల రోదన గ్రామస్తులను కలిసివేసింది.