రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు డీసీఎం వ్యాన్లు ఢీ..

రెండు డీసీఎం వ్యాన్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇరువురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని ఖాన్ ఖాన్ పేట సమీపంలో చోటు చేసుకుంది.

Update: 2023-06-28 16:46 GMT

దిశ, కల్లూరు: రెండు డీసీఎం వ్యాన్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇరువురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని ఖాన్ ఖాన్ పేట సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు డీసీఎం వ్యాన్ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖాన్ ఖాన్ పేట సమీపంలోని ప్రధాన రహదారిపై మరమ్మత్తుల నిమిత్తం రోడ్డును తొవ్వి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే హెచ్చరిక బోర్డులు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో.. ఒక వైపుకే వాహనాలు ప్రయాణిస్తూ ఉండటంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు.

మహారాష్ట్రకు చెందిన డీసీఎం డ్రైవర్ కేశవ(29), క్లీనర్ సిరి సాగర్ (28)మరో డీసీఎం డ్రైవర్ చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన మరీదు కృష్ణ(31) లు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు క్షతగాత్రులను కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు.


Similar News