గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్..పరారీలో ఇద్దరు నిందితులు

నిషేధిత గంజాయిని తరలిస్తున్న నిందితుడిని సంగారెడ్డి జిల్లా

Update: 2024-10-24 13:36 GMT

దిశ,ఝరాసంగం: నిషేధిత గంజాయిని తరలిస్తున్న నిందితుడిని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి నుంచి రూ.32,375 వేల విలువగల సుమారుగా 1,295 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ రూరల్ సీఐ హనుమంతు, ఎస్సై నరేష్ వివరాలను వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం బర్దిపూర్ గ్రామంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో బీదర్ నుంచి బర్దిపూర్ వైపు వస్తున్న వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పద ఉన్న వ్యక్తిని తనిఖీ చేయాగా ఎండు గంజాయి లభించింది అన్నారు. ఝరాసంగం మండలం బొప్పన్ పల్లి గ్రామానికి చెందిన అనిల్ గా గుర్తించారు. గత మూడు నెలలుగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సీఐ హనుమంతు, ఎస్సై నరేష్ పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు కర్ణాటక బీదర్ కు చెందిన పునీత్,జాఫర్ అలీ పరారీలో ఉన్నట్లు వారిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.


Similar News