ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Update: 2024-10-08 15:18 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన నాయికోటి కిష్టయ్య (50), భార్య సులోచన అదే గ్రామానికి చెందిన వంగరి ప్రభువులు వద్ద పౌల్ట్రీ ఫామ్ ఆరు నెలల క్రితం లీజుకు తీసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు మొదలవడంతో కిష్టయ్య జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య సులోచన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.  

Tags:    

Similar News