ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరేడుచర్ల పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-10-08 09:58 GMT

దిశ, నేరేడుచర్ల : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరేడుచర్ల పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నేరేడుచర్ల ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల పట్టణంలోని చింతబండ కాలనీకి చెందిన ఎడ్ల సైదులు( 44) అనే వ్యక్తి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య జానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. 

Tags:    

Similar News