చనిపోతూ సెల్ఫీ వీడియో.. ఆ అధికారులను శిక్షించాలని కోరిన మృతుడు..

జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లకావత్ శ్రీను (24) అనే వ్యక్తి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు.

Update: 2024-10-19 03:22 GMT

దిశ, పాలకుర్తి/తొర్రూరు : జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లకావత్ శ్రీను (24) అనే వ్యక్తి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీను మృతి చెందే ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై సాయి ప్రసన్న కుమార్ ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. శ్రీను ఆఖరిగా తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఐ,ఎస్ఐతో పాటు మరో ఆరుగురిని కఠినంగా శిక్షించాలని శ్రీను ఆఖరి కోరికగా సెల్ఫీ విడియో తీసి మరణించాడు. శ్రీను మరణంతో తండాలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను గిరిజనులు పెద్ద ఎత్తున ముట్టడి చేయనున్నారని సమాచారం.


Similar News