గుర్తు తెలియని దుండగులచే వ్యక్తి దారుణ హత్య : తూప్రాన్ డీఎస్పీ

చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక

Update: 2024-10-24 10:35 GMT

దిశ,చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనకాల డోర్ వెనుక( 30) సంవత్సరాల మృతదేహం గురువారం కలకలం సృష్టించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సాయి సింధు పోలీసులకు సమాచారం ఇచ్చారని, ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. దీంతో తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై నారాయణ గౌడ్ పరిశీలించారు. క్లూస్ టీమ్ తో, పాటు సీసీ ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తరువాత ఎవరు హత్యకు ఒడిగట్టారో అనే కోణాల్లో ఆలోచించిన తర్వాత నిందితులను పట్టుకుంటామని ఆ తర్వాత నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యక్తిని బండరాయితో కొట్టి చంపినట్టు దుండగులు పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Similar News