గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ప్రేమజంట

అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న ప్రేమజంట గంజాయి అమ్ముతూ పట్టుబడి కటకటాల పాలయ్యారు.

Update: 2024-10-02 16:27 GMT

దిశ, ఎల్బీనగర్ : అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న ప్రేమజంట గంజాయి అమ్ముతూ పట్టుబడి కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యాపర్తి గోపి, ఉమామహేశ్వరి ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిన్నచిన్న పనులు చేస్తుండగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి విక్రయిస్తూ ఆర్థికంగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో గంజాయి సరఫరా చేస్తున్నటు శివనాగరాజు పరిచయమయ్యాడు. శివ నాగరాజు నగరంలో రెండు కేజీల నుండి ఐదు కేజీల వరకు హోల్​సేల్​గా గంజాయి విక్రయిస్తుంటాడు.

    నాగరాజు వద్ద గంజాయి కొనుగోలు చేసిన ప్రేమజంట 200 గ్రాముల ప్యాకెట్ గా మార్చి స్కూటీపై దంపతులిద్దరూ విక్రయిస్తుండగా ఈ విషయం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచార మేరకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద కాపుకాచి గంజాయి విక్రయిస్తున్న గోపి, ఉమామహేశ్వరి దంపతులతో పాటు కొనుగోలు చేస్తున్న నాగోల్ కు చెందిన ప్రభు చరణ్, నగేష్​ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. ఎస్ఓటీ పోలీసుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కిలో గంజాయి, మూడు సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.  

Tags:    

Similar News