బైక్ ను ఢీకొన్న కారు.. బైకిస్ట్ మృతి

బైక్ ను ఢీకొన్న కారు.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బొంరాస్ పేట్ మండలంలోని మెట్ల కుంట చెక్ పోస్ట్ సమీపంలో,

Update: 2024-10-13 11:38 GMT

దిశ, బొంరాస్ పేట్: బైక్ ను ఢీకొన్న కారు.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బొంరాస్ పేట్ మండలంలోని మెట్ల కుంట చెక్ పోస్ట్ సమీపంలో, 163 జాతీయ రహదారి పై చోటుచేసుకుంది. మద్దూరు మండలం లోని చింతల్ దిండికి చెందిన ఎరుకలి మొగులయ్య హైదరాబాద్ నుంచి సొంతూరికి వస్తుంటే, కొడంగల్ నుంచి పరిగి వైపు వెళ్తున్న ఫార్చునర్ కారు బైక్ ను ఢీ కొట్టడంతో, బైక్ పై ఉన్న మొగులయ్య కు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఢీకొట్టిన కారు శంకర్ పల్లి మాజీ జడ్పీటీసీ దిగా అనుమానం.


Similar News