ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్.. పెరిగిన మరణాలు

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతున్నా కరోనా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 20,937కరోనా కేసులు వెలుగుచూడగా, 104 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,09,156 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9,904 కొవిడ్ మరణాలు సంభవించాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10మంది చొప్పున మృతి చెందగా, తూ.గో జిల్లా, నెల్లూరు, విశాఖల్లో […]

Update: 2021-05-21 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతున్నా కరోనా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 20,937కరోనా కేసులు వెలుగుచూడగా, 104 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రస్తుతం ఏపీలో 2,09,156 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9,904 కొవిడ్ మరణాలు సంభవించాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10మంది చొప్పున మృతి చెందగా, తూ.గో జిల్లా, నెల్లూరు, విశాఖల్లో 9మంది చొప్పున మరణించారు. ఇకపోతే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Tags:    

Similar News